పాలేరు నదిపై చప్టా నిర్మించాలి: సిపిఎం

ప్రజాశక్తి-టంగుటూరు : సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఈ రోజు చింతలపాలెం, రామనాథపురం గ్రామాల్లో పర్యటన చేసింది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న పాలేరుపై చప్టా లేనందున, రోడ్డు లేనందున తాము చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు సిపిఎం బృందం దృష్టికి తీసుకొనివచ్చారు. ఈ బృందానికి చప్టా నిర్మించాల్సిన ప్రాంతాన్ని, గుంతలు పడి, ఇసుకతో ఉన్న రోడ్డును చూపించి రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రామనాథపురం గ్రామంలో రోడ్డుకు ఒక వైపు నందనవనం పంచాయతీలో, రెండోవైపు పలుకూరు పంచాయతీలో ఉండటం వల్ల తమకు చాలా ఇబ్బంది కరంగా ఉందని ప్రజలు బృందానికి తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జీ శ్రీనివాస్‌, టీ రాము, వి మోజెస్‌, తానికొండ నారాయణరావు, తన్నీరు సుబ్బారావు, దావులూరి కృష్ణ, ప్రజలు పాల్గొన్నారు.

➡️