ప్రజాశక్తి -ప్రొద్దుటూరు ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పేద, మధ్య తరగతి, కార్మిక, కర్షక, ప్రజల సమస్యలపై పోరాటాలు, కార్యక్రమాలు, ఉద్యమాలు రూపొందించుకొని ప్రజలకు దగ్గర కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన పట్టణ కమిటీ విస్తత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం జాతీయ 24వ మహాసభలు పిలుపుమేరకు ప్రజా బహుళయ పార్టీగా తీర్చిదిద్దాలన్నారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కులాల మధ్య విద్వేషాలను రగిలించడానికి కుట్రపూరితంగా బిజెపి ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రులు వెల్లడిస్తున్నారని తెలిపారు. కులగణనపై మనువాదుల నిర్ణయం అమలు మార్గదర్శకరణం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మండల్ కమిషన్ 40 సిఫారసులను తీసుకొని సర్వే ఫార్మేట్లు తయారు చేయాలన్నారు. కేంద్రంలో కులగణన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని బిసి కమిషన్ల చైర్మన్లు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ, న్యాయని పుణులు, ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల నాయకులు సభ్యులుగా ఉండా లన్నారు. దళిత గిరిజనులు చర్చిలకు మసీదులకు దేవాలయాలకు వెళ్లినంత మాత్రాన కులం మారదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని మరచి అంటరానితనాన్ని సజించని హైకోర్టులు అశాస్త్రీయమైన తీర్పులు ఇస్తున్నాయని వారు ఊటింకించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాబు సర్వేశ్వరమ్మ విజరు సాల్మన్ శాఖా కార్యదర్శులు శేఖర్ వెంకటసుబ్బమ్మ శీను నాగలక్ష్మి యువజన సంఘం నాయకులు విశ్వనాథ్ డేవిడ్ పాల్గొన్నారు.
