వానతో పంట దెబ్బతిన్న రైతుల్ని ఆదుకోవాలి

May 5,2025 22:31

కుంచనపల్లిలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలిస్తున్న రైతుసంఘం నాయకులు
ప్రజాశక్తి తాడేపల్లి రూరల్‌ :
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులందర్నీ ఆదుకోవాలని రైతుసంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం గాలి, వానకు కుంచనపల్లిలో దెబ్బతిన్న పంటలను నాయకులు సోమవారం పరిశీలించి బాధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ గత నెలలో అకాల వర్షం కురిసి పసుపు, మొక్కజొన్న పంటలు కళ్లాలలోనే తడిసిపోయాయని, ఇప్పుడు అరటి గెలలతో చెట్లు నేలకొరిగి రైతులకు నష్టం వాటిలిందని చెప్పారు. మొక్కజొన్న పంట కూడా బూజు పట్టి దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులకు వాటిల్లిన నష్టంపై తక్షణమే వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పరిశీలనలో రైతుసంఘం నాయకులు ఎ.రంగారావు, ఎ.శివనాగేశ్వరరావు, కె.హరీష్‌ పాల్గొన్నారు.

➡️