నేల బావిలో మృతదేహం

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : నేల బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటం మార్టూరులో కలకలం రేపింది. శనివారం ఉదయం అర్బన్‌ సీఐ ఎస్వీ రాజశేఖర్‌ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. స్థానిక పెద్ద కూరగాయల మార్కెట్‌ సమీపంలో లంబాడి తండాకు వెళ్లే దారిలో పొలాల్లో ఉన్న నేల బావిలో పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు ఈరోజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ బావిలో నుంచి మఅతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ బావిలో పడవేశారా ? ఆత్మహత్య అనే సమాచారం పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడి కానున్నట్లు సిఐ తెలిపారు.

➡️