పల్నాడు జిల్లా మాచర్లలో ప్రదర్శన
ప్రజాశక్తి – గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ బుధవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బాధితులకు సంఘీభావం వెల్లువెతింది. గుంటూరులోని వైసిపి జిల్లా కార్యాలయం నుండి బృందావన్ గార్డెన్స్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు చేయకుండా కేంద్ర నిఘాబృందం వ్యవహరించాలని కోరారు. మాచర్లలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. బాధితులకు అండగా భారతీయులంతా నిలవాలని రామకృష్ణారెడ్డి అన్నారు. సత్తెనపల్లిలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.అజరు కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.
