మూడో రోజుకు చేరుకున్న మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : మున్సిపల్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై చేపట్టిన ధర్నా బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఎర్రి స్వామి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి ముత్తుజ హాజరైనారు వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని అన్నారు మున్సిపల్‌ కార్మికులు మండుటెండలలో మూడు రోజులు పాటు వారి సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేపట్టిన కూడా కనీసం కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి కమిషనర్‌ కార్మికుల మధ్య కు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు అనంతపురం పట్టణ ప్రజలకు ఎవరూ చేయలేని సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికులు దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళన గురిచేసిన మహమ్మారి కరోనా సైతం లెక్కచేయకుండా ప్రజలే దేవుళ్ళని విధులు నిర్వహించినటువంటి మున్సిపల్‌ కార్మికుల సమస్యలను గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణి కి నిదర్శనం అన్నారు ప్రజలు కడుతున్న పన్నుల రూపంలో కోట్లాది కోట్ల రూపాయలను దాచుకోవడం దోచుకోవడం తప్ప నగరపాలక సంస్థకు మరి ఏమి తెలియదని అన్నారు నగరపాలక సంస్థకు వచ్చిన కమిషనర్లు అందరూ కార్మికులకు అండగా ఉంటామని హామీలతోనే మభ్యపెడుతున్నారు కానీ కార్మికుల కష్టాలను గుర్తించకపోవడం వారి సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని, వారికి ఎక్స్‌ గ్రేషియా అమలు చేయాలని అనంతపురం పట్టణ ప్రజలకు అనుకూలంగా కార్మికుల సంఖ్య 200 మందినీ పెంచాలని అన్నారు అదనపు కార్మికులకు అధికారులతో పాలకవర్గాలతో చర్చల సందర్భంగా 15 వేల రూపాయలతో వేతనంతో పాటు ఈపీఎఫ్‌ ఈఎస్‌ఐ అమలు చేస్తామని చెప్పి అధికారులు మాట తప్పడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు 2011 వ సంవత్సరంలో 309 మందికి తొమ్మిది నెలల పిఎఫ్‌ డబ్బులు ఎవరి జేబులలో దాగి ఉన్నాయో అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు పట్టణ ప్రజలందరూ రోడ్లమీద గుంతలలో రాత్రివేళ అనేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పినా కూడా ఆ గుంతల రోడ్లను మరమ్మత్తులు చేయడానికి 30 మంది కార్మికులను ఇంజనీరింగ్‌ సెక్షన్‌ భాగంలో పెంచమని అడుగుతున్న నేటికీ పరిష్కారం కానీ సమస్యగా మారిపోవడం జరుగుతున్నది ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో నగరపాలక అధికారులు చెప్పాలని కోరారు రెగ్యులర్‌ కార్మికులకు మూడు సంవత్సరాలుగా బకాయి ఉన్న సరెండర్‌ లీవ్‌ నీ, సి డి ఎం ఏ తోను రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చించి రెగ్యులర్‌ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు, మున్సిపల్‌ కార్మికులందరికీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయించాలని ఎన్ని దపాలుగా మొరపెట్టుకుంటున్న నగరపాలక సంస్థకు వచ్చిన కమిషనర్లు అందరూ మాటకే పరిమితమవుతున్నారు కానీ ఆచరణలో లేకపోవడం మున్సిపల్‌ కార్మికులు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు తక్షణమే నగరపాలక సంస్థ కమిషనర్‌ కార్మికుల సమక్షంలోకి వచ్చి మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకుంటే ఈనెల కార్మికుల చట్టాల పైన 20 వ తారీకున చేపట్టిన దేశవ్యాప్తంగా సమ్మె మున్సిపల్‌ కార్మికుల సమస్యల పైన 21, 22 కూడా కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రెగ్యులర్‌ ఉద్యోగ కార్మిక సంఘం నగర అధ్యక్షులు ముత్తురాజు , నగర కార్యదర్శి తిరుమలేష్‌, నగర సహాయ కార్యదర్శి బంగ్లా రాఘవేంద్ర ప్రసాద్‌, పెన్నా, కుమార్‌, నాగేంద్ర, పుల్లన్న, మీసాల నారాయణ, మరియమ్మ, తదితర కార్మికులు పాల్గనడం జరిగినది.

➡️