తాగునీరు ఇవ్వాలని మల్లవరంలక పంచాయతీ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

May 6,2025 15:40 #water, #west godavari

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా ) : నరసాపురం మండలం మల్లవరంలక గ్రామంలో గత ఐదు రోజులుగా తాగునీరు ఇవ్వక పోవడంతో పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో పైపులైన్ పగిలి పోయి ఒకటవ వార్డు నుండి నాలుగోవ వార్డు వరకు గత ఐదురోజులుగా తాగునీరు అందటం లేదన్నారు. దీంతో ప్రజలు తాగునీరుతో పాటు కనీసం వాడుకోవడానికి నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఇంతటి సమస్య ఉన్నా, దీనికితోడు వేసవి కాలం అయినా స్థానిక అధికారులు స్పందించక పోవడం దారుణమన్నారు. ప్రజలు గంటల తరబడి ఆందోళన చేస్తున్న కనీసం స్థానిక అధికారులెవరూ స్పందించలేదన్నారు. సమస్యను నరసాపురం ఎంపిడివో దృష్టికి తీసుకెళ్లినా మా చేతుల్లో ఏమిలేదు మాట్లాడతాము మాట్లాడతాము అని చెప్పడంతో నరసాపురం ఆర్డీవో దాసి రాజు దృష్టికి తీసుకెళ్ళమన్నారు. సమస్యపై ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ట్యాంకర్ ద్వారా తాగునీరు ఇస్తామని తెలిపారన్నారు. వేసవి సీజన్ కావడంతో ఈనెలాఖరు వరకు స్వచ్చమైన తాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్రావు, కమిటీ సభ్యులు కవురు శ్రీనివాసు,స్థానికులు కవురు గోపాలకృష్ణ, గుబ్బల సత్యనారాయణ, కవురు త్రిమూర్తులు, యాండ్ర హనుమంతు,దిడ్ల నరేష్, దిడ్ల సౌదామణి, కట్టా రమణ,జక్కంశెట్టి సుజాత,కవురు కవురు దుర్గాప్రసాద్, కవురు మల్లమ్మ,గంగమ్మ,కవురు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️