ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని వెంగంవారిపల్లి పంచాయతీ పరిధిలోని కడతట్లపల్లి గ్రామానికి చెందిన బండపల్లి రామచంద్రప్ప పొలం వద్ద పాక వేసుకొని ఆవులను మేపుకుంటున్నాడు. గురువారం రాత్రి ఈదురుగాలి వచ్చి వర్షం పడింది. ఆ సమయంలో అతను పక్కన ఉన్న ఇంకొక పాకలో ఉన్నాడు. పెద్దగా ఉరుముల శబ్దం రావడంతో కొంతసేపు ఏమి జరిగినదో తెలియక ఆందోళన చెంది తరువాత చూడగా ఆ పిడుగుపడి లేగదూడ మృతి చెందింది. నష్టాన్ని గుర్తించి, ప్రభుత్వం సాయం చేయాలని పశువుల కాపరి విన్నవించుకున్నారు.
