ప్రజాశక్తి-ఆనందపురం : మండలంలోని గొట్టిపల్లి హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ గురువారం పంపిణీ చేశారు. పాఠశాలలో వసతులు, భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త ఘట్టమనేని బోసుబాబు, యార్లగడ్డ జీవన్, బిఆర్బి.నాయుడు, తాట్రాజు అప్పారావు, బలిరెడ్డి చంటి, మీసాల సత్యనారాయణ, పాండ్రంగి అప్పలరాజు, బమ్మిడి ఉమ, కోరాడ నాయుడు బాబు, కోరాడ తమ్ము నాయుడు(రాజు), సుంకర శివ, బన్నీ, తాడివాడ శివకృష్ణ, వెంకటరమణ, బంగారు నాయుడు, కొలగాని రమణ, కోరాడ శంకర్ ,ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు
పుస్తకాలు పంపిణీ చేస్తున్న రవితేజ