ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన నాగాబత్తుల రాంబాబు, కాండ్రేగుల వెంకటలక్ష్మి లకు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందింది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న బాధితులు నాగాబత్తుల రాంబాబుకు రూ.82,096, కాండ్రేగుల వెంకటలక్ష్మి కి రూ.1,11, 008 వంతున సీఎం రిలీఫ్ ఫండ్ సాయం మంజూరు అయ్యింది. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రామచందర్రావు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి చేతుల మీదగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరిని మానవత్వంతో సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీరామ్మూర్తి, చొల్లంగి సాయిబాబు, కొడమంచిలి సత్యనారాయణ, పేరాబత్తుల నాగభూషణం, పెద్దిరెడ్డి సురేష్, కాండ్రేగుల సత్యనారాయణ, నాగాబత్తుల ఏడుకొండలు, పెద్దిరెడ్డి రామకఅష్ణ, పెద్దిరెడ్డి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
