ప్రజాశక్తి – పార్వతీపురం : సాలూరు శ్యామలంబ జాతరలో శిథిలావస్థ భవనాలపై యాత్రికులు ఎక్కకుండా చూడాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ శోబిక అధికారులను ఆదేశించారు. శ్యామలాంబ ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం సంబంధిత అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 18 నుండి 20 వరకు మూడు రోజుల పాటు ఉత్సవం జరుగు తుందన్నారు. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడా నికి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. సిరిమాను ఉత్సవంలో శిథిలావస్థ భవనాలపైన ప్రజలు ఎక్కి అవకాశాలు ఉంటాయని, అటువంటి భవనాలను గుర్తించి వాటి పైకి ఎక్కడాన్ని నిషేదించాలని సూచించారు. మూడు రోజుల పాటు తాగునీరు, విద్యుత్ సరఫరా నిరంతరంగా జరుపుటకు, పూర్తి స్థాయి పారిశుధ్యం నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పండుగకు సుమారు 10 లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా ఉందని అన్నారు. సిరిమాను రథం చుట్టూ సరైన రక్షణకు సిబ్బంది ఉండాలని, మద్యం సేవించిన వారు దగ్గరకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. బస్సులు ఆర్టిసి కాంప్లెక్స్ వరకు కొన్ని రూట్ల నుండి వస్తాయని, మక్కువ తదితర రూట్లలో వచ్చే వాహనాలు పట్టణంలోకి వచ్చే అవకాశాల్లేవని చెప్పారు. రెండు పూటలా సరఫరాకుతాగునీటిని రెండు పూటలా సరఫరాకు చర్యలు చేపడుతున్నామని, రెండు ట్యాంకర్ల ద్వారా నిత్యం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు 119 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, మరో 80 మంది సిబ్బంది అవసరమని తెలిపారు. ప్రస్తుత మూడు ట్రాక్టర్లు ఉన్నాయని, మరో ఐదు ట్రాక్టర్లు అవసరమని చెప్పారు. 50 మొబైల్ మరుగుదొడ్లను 16 ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆర్ టి సి 10 రూట్లలో 148 బస్సులు నడుపుటకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్ టి సి అధికారులు తెలిపారు. 14ప్రదేశాల్లో వైద్యశిబిరాలుపట్టణంలో గుర్తించిన 14 ప్రదేశాల్లో వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తోంది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు 108 వాహనాలను, 5 ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డి.శివకుమార్ తెలిపారు. మద్యం నియంత్రణకు 5 చెక్పోస్టులనుమద్యం నియంత్రణకు 5 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఒక రిజర్వ్ పార్టీ మరో ఫ్లయింగ్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి చేశామని ఇఇ వేణుగోపాల నాయుడు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రా రెడ్డి, డిఎస్పీ ఎం.రాంబాబు, డిపిఒ టి.కొండలరావు, జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్ కె శ్రీనుబాబు తదితర అధికారులు హాజరయ్యారు.
