తిరుమల : ఎస్వి వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన సాయి రాఘవేంద్ర నిర్మాణం సంస్థ ఛైర్మన్ శ్రీ ఎం జనార్ధన్ అనే భక్తుడు టిటిడి శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ.10,00,116 విరాళం ఇచ్చారు. శనివారం తిరుమలలోని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్ ను ఆయనకు అందజేశారు.