తిరుమల : హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు. ఈ ప్రకటన టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారితో విడుదల చేయబడింది.
