ధవలేశ్వరం కస్తూర్బా విద్యార్థిని మండలం ఫస్ట్‌

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ (తూర్పు గోదావరి) : ధవలేశ్వరంలోని స్థానిక జిల్లా పరిషత్‌ కస్తూర్బాగాంధీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని డి.దీపిక మండలం ఫస్ట్‌ సాధించడం జరిగింది. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జయకేతనంను ఎగురవేశారు. 87 శాతం ఉత్తీర్ణతను సాధించారు. పదవతరగతి పాఠశాల విద్యార్థినిలు మొత్తం 207 మంది పరీక్షలు వ్రాయగా 180 మంది విద్యార్థినిలు ప్రధమశ్రేణి సాధించడం జరిగింది. అంతేకాకుండా 54 మంది విద్యార్థులు 500 పైగామార్కులు సాధించడం విశేషం. 585 మార్కులతో డి. దీపిక కస్తూర్బా గాంధీ పాఠశాల నుండి అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 575 కె. షారోన్‌ గ్రేసి, ఇ.హేమ 566 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.  180 మంది విద్యార్థినీలలో 132 మంది ప్రధమ శ్రేణి సాధించటం విశేషం. 32 మంది విద్యార్థినిలు ద్వితీయశ్రేణి, 15 మంది తృతీయ శ్రేణి సాధించారు. మండలం ఫస్ట్‌ వచ్చిన డి .దీపికను(585), స్కూల్‌ సెకండ్‌ వచ్చిన కె.షారోన్‌ గ్రేసీ( 575) స్కూల్‌ థర్డ్‌ ఈ. హేమ (566)లను రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల. బుచ్చయ్య చౌదరి అభినందించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలని ఇతర అధ్యాపక సిబ్బందిని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. డి. కే. వి. ప్రసన్న కుమారి ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ప్రశంసించి, అభినందనలును తెలియజేశారు.

➡️