అల్లూరికి ఘన నివాళి

May 7,2025 21:46
జువ్వల రాంబాబు అన్నారు.

ప్రజాశక్తి – కొవ్వూరు, కడియం

బిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి గిరిజనులకు అండగా అల్లూరి సీతారామరాజు పోరాటం సాగిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జువ్వల రాంబాబు అన్నారు. బుధవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి ఆశయాల సాధన కోసం సిపిఎం ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తుంటే ఆదివాసీల పక్షాన సిపిఎం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కగార్‌ పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలు బలి తీసుకుంటుందని, తక్షణం కగార్‌ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అల్లూరి స్ఫూర్తితో వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుందర్‌బాబు, నాయకులు దగ్గు అశోక్‌, కె.కనకారావు డి.రాధాకృష్ణ, ఎం.జ్యోతిబసు, ఎం.వీరబాబు, పాలచర్ల జగన్నాథం, వై.ఈశ్వరరావు, ఎస్‌.బాపిరాజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే కడియంలో అల్లూరి విగ్రహానికి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, భగత్‌సింగ్‌ సేవాసమితి అధ్యక్షుడు తమ్మిశెట్టి ప్రసాద్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి త్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గారపాటి తాతబ్బాయి, బోనం సత్యనారాయణ, బొర్రా రామకృష్ణ, చిక్కాల శ్రీను, బరగట్ల సత్యనారాయణ, చల్లా అంజి, దాసరి ముత్యం, గానుగుల కామేశ్వరరావు పాల్గొన్నారు.

➡️