ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలుజమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ధవళేశ్వరంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధవలేశ్వరం సిఐ టి.గణేష్, టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు. మృతులకు సంతాపం తెలిపారు. నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ నుండి గణపతి సెంటర్ వరకూ రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంత మాత్రం సహించరాదని అన్నారు. పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడడం కలచివేసిందన్నారు.
