చాగల్లులో సివిల్ మాక్ డ్రిల్

May 8,2025 11:44 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు : భారత్ పాక్ మధ్య ఉద్రత పరిస్థితి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సివిల్ మార్క్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని రీతిలో ఉగ్రదాడులు జరిగిన బాంబులు పేలిన అగ్రి ప్రమాదల సంభవించిన ఎలా వ్యవహరించాలని అంశాలపై ప్రజలకు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు. తాసిల్దారు ఎం మేరి కమ్మ మాట్లాడుతూ ఏ క్షణాన యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియపరు. ఎంపీడీవో ఆర్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వం ఉండాలని విద్యుత్తు వినియోగించకూడదని తెలిపారు. ఎస్సైకే నరేంద్ర మాట్లాడుతూ యుద్ధం వచ్చే సమయంలో తీసుకోవలసిన సూచనలు సలహాలు సూచించారు. గుంపులు గుంపులుగా ఉండరాదని ఏమైనా బాంబులు వేస్తే వంకర టింకర్ గా వెళ్లాలని పెద్ద పెద్ద బిల్డింగ్ల వద్దకు వెళ్లకూడదని పలు సూచనలు తెలిపారు. అలాగే విద్యార్థులతో మార్క్ డ్రిల్ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మండలంలోగ్రామ పంచాయతీ కార్యదర్శులు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వివిధ శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️