ఆర్‌సిఎతో మారనున్న నగరం ముఖచిత్రం

May 8,2025 22:34
రివర్‌ సిటీస్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
రివర్‌ సిటీస్‌ అలయెన్స్‌(ఆర్‌సిఎ) కార్యక్రమంతో రాజమహేంద్రవరం ముఖచిత్రమే మారిపోనుందని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. కమిషనర్‌ సూచనల మేరకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (ఎన్‌ఐయుఎ) బృందం గురువారం నగరంలో పర్యటించింది. రివర్‌ సిటీస్‌ అలయెన్స్‌ అనేది నదీతీరంలో ఉన్న నగరాలను అభివృద్ధి చేసే ఓ బహత్తర కార్యక్రమమని కమిషనర్‌ తెలిపారు. దీనిని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా, ఎన్‌ఐయుఎ సంయుక్తంగా నిర్వహిస్తుందన్నారు. 2021 నవంబర్‌ 25న అప్పటి కేంద్ర జల శక్తి మంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంద న్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 146 నగరాలు సభ్యత్వ నగరాలుగా ఉన్నాయన్నారు. ఈ నగరాల అభివృద్ధికి ఎన్‌ఎంసిజి, ఎన్‌ఐయుఎ సంయుక్తంగా అర్బన్‌ రివర్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాన్‌కు రూపకల్పన చేశాయన్నారు. నగరాల్లోని నదీ పర్యా వరణాన్ని తగిన రీతిలో స్థిరంగా నిర్వహిం చేందుకు కావాల్సిన సమగ్ర వ్యూహాలను యుఆర్‌ఎంపి అందజేస్తుందన్నారు. ఇప్పటికే కాన్పూర్‌, అయోధ్య, బరేలీ, మోరదాబాద్‌, ఛత్రపతి సమ్భాజీ నగర్‌ వంటి నగరాలు ఎన్‌ఎంసిజి, ఎన్‌ఐయుఎ సాంకేతిక సాయంతో యుఆర్‌ఎంపి ఫ్రేమ్‌ వర్క్‌ను విజయ వంతంగా అమలు పరుస్తున్నాయన్నారు. నగర పాలక, రెవెన్యూ, అటవీ, టూరిజం, రుడా, పిహెచ్‌ఇడి అధికారులతో కలిసి రెండు రోజుల పాటు ఈ బృందం నగరంలో పర్యటిస్తుందన్నారు. 15కి పైగా నదీ సంబంధిత ముఖ్య ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిపి మల్టీ – స్టేక్‌ హోల్డర్ల సమావేశం కూడా నిర్వహించుకున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. నదీ పర్యావరణాన్ని అభివృద్ధి పరిచేందుకు రాజమహేంద్రవరం ఎంతో అనువైనదిగా ఈ బృందం గుర్తించిందన్నారు. రానున్న రోజుల్లో అర్బన్‌ రివర్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాన్‌ ద్వారా రాజమహేంద్ర వరం మరింత సుందరంగా, ఆదర్శ నగరంగా మారుతుందనడంలో సందేహం లేదన్నారు.

➡️