ప్రజాశక్తి-చాగల్లు : తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగ జుట్ట కొండలరావు (ఏడుకొండలు) మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు మట్ట వెంకట్రావు ఐ టి వి జిల్లా అధ్యక్షుడు ఇంటి వీరాజు వైయస్సార్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ జాలి వెంకటరావు లను వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రామ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సురేంద్ర స్వగ్రామంలో పూలమాలలు సాలువల తో ఘనంగా సన్మానించారు. పార్టీ పటిష్ట కోసం అందరూ కలిసి పని చేస్తామని ఉన్న గట్ల గ్రామ సర్పంచ్ మండల వైఎస్ఆర్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకట్రావు అన్నారు. వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టా ఏడుకొండలు మాట్లాడుతూ పదవి రావడంతో పార్టీ అభివృద్ధికి మరింత బాధ్యత పెరిగిందని తమకు పార్టీ పదవిలు రావడానికి కృషి చేసిన కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు కు వైఎస్ఆర్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చేల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్రోతు సూర్యనారాయణ గెడ శ్యామ్ తోట రామకృష్ణ సుంకర సత్యనారాయణ బొర్రా కృష్ణ షేక్ పా షా దూళి పాల సూరిబాబుశ్రీరంగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు
