నగరాన్ని సుందర తీర్చిదిద్దుదాం: కలెక్టర్‌

May 7,2025 21:43
తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

గోదావరి పుష్కరాలను పురష్కరించుకుని రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రూ.8 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ అప్పర్‌ ప్రామినేడ్‌ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర కమిషర్‌ కేతన్‌ గర్గ్‌, రాజానగరం ఎంఎల్‌ఎ బత్తుల బలరామకృష్ణ, ఎంఎల్‌సి సోమువీర్రాజు, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత నగర జనాభా 5 లక్షలు కాగా.. పుష్కర సమయంలో రోజూ 10 లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారనే అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గత పుష్కరాల సమయంలో కేవలం పుష్కర ఘాట్లను మాత్రమే అభికృద్ధి చేసుకున్నామని.. కానీ ఈ పుష్కరాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. వచ్చే భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాల కల్పించడంతో పాటు నగర సౌందర్యాన్ని కూడా చూపబోతున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. రాజమహేంద్రవరం అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు నిత్యం దృష్టి సారిస్తున్నారని తెలిపారు. 2027 పుష్కరాల నాటికి నగరం మరింత అందంగా, ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేంద్ర పర్యాటక శాఖ ద్వారా రూ. 100 కోట్ల నిధులు మంజూరు అయినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ నిధులలో రూ. 97 కోట్లు ఒక్క రాజమహేంద్రవరం నగరానికే కేటాయిం చగా.. పనులు త్వరలోనే ప్రారంభ మవుతాయని వెల్లడించారు. ఎంఎల్‌సి సోము వీర్రాజు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి పుష్కరాలే ఓ మంచి వేదిక అని చెప్పారు. రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజమ హేంద్రవరంలో నగర ప్రజలు పెనుమార్పులు చూడబోతున్నారని తెలిపారు. నగర కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కల్చరర్‌ క్యాపిటల్‌గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజానగరం ఎంఎల్‌ఎ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు చల్లా శంకర్‌రావు, గన్ని కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

➡️