తాళ్లపూడిలో మాక్ డ్రిల్

May 8,2025 11:46 #East Godavari

ప్రజాశక్తి-తాళ్లపూడి : భారత్ పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న ఉద్దేశం మధ్య యుద్ధం సంభవిస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియజేసే విధంగా తాళ్లపూడి బస్టాండ్ సెంటర్లో గురువారం ఉదయం అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తాసిల్దార్ భారతి ఎంపీడీవో రమణ ఎస్సై రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ యుద్ధం కనుక వస్తే ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా హెచ్చరిస్తుందో తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లో సైనిక వాహనాలు కనుక వస్తే అటువంటివి ఫోటో తీయవద్దని వాట్సాప్ లో పోస్ట్ చేయవద్దని సూచించారు. రాత్రి సమయాల్లో ఇళ్ళల్లో లైట్లు వేయకుండా ముందుగా తీసుకోవాలని అన్నారు.

➡️