పలుచోట్ల ఈదురు గాలులు, వర్షం

May 9,2025 23:16
పలుచోట్ల ఈదురు గాలులు, వర్షం

ప్రజాశక్తి-పెరవలి, ఉండ్రాజవరంపెరవలి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కానూరు, తీపర్రు, అన్నవరప్పాడు, పిట్టలవేమవరం, అజ్జరం, వెంకట్రాంపురం తదితర గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం అయ్యాయి పలుచోట్ల రైతులు వేసిన ధాన్యం రాశులు వర్షానికి తడిసిపోయాయి. సుమారు 20 విద్యుత్‌ స్తంభాలు ఆయా గ్రామాల్లో విరిగిపోవడంతో విద్యుత్‌ అధికారులు ఆయా గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. వ్యవసాయ విద్యుత్‌ శనివారం పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈదురు గాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు స్తంభాలు విరిగిపడటంతో తొలగింపులో సంబంధిత అధికారులు నిమగమయ్యారుఉండ్రాజవరం మండలంలో గాలి వాన బీభత్సం సష్టించింది. పలు గ్రామాలలో మామిడి చెట్లు, వేప చెట్లు నేలకొరిగాయి. కోకో తోటలు తలలు నేల వాల్చాయి. వెలగదుర్రు సచివాలయం కిటికీ అద్దాలు పగిలాయి, వాన నీరు కార్యాలయం లోనికి చేరుకుంది. విద్యుత్‌ స్తంభాలు పలుచోట్ల నేలకొరిగాయి. దీంతో మండలంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. ఇంకో రెండు నెలల్లో చేతికి అంది వస్తుందనుకున్న అరటి తోట నేల కొరిగిపోయిందని తాడిపర్రు రైతులు, కౌలు రైతులు యడ్ల సాల్మన్‌ రాజు, యడ్ల కుటుంబరావు, యడ్ల రాజు, కరుటూరి నరసింహమూర్తి, గారపాటి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లాలపై ధాన్యం ఆరబోసిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

➡️