ప్రజాశక్తి-చాగల్లు : చంద్రవరంశాఖా గ్రంధాలయంలో గురువారం సమ్మర్ క్యాంపులో విద్యార్థులచే మద్దిరాల శ్రీనివాసులు రచించిన “నగర దిష్టి” బాలల కథలు నుండి దేవుని మహిమ, శకునాల గోపయ్య, మంచి కాకి కథ, మారిన బామ్మ.. మొదలగు కథలను చదివించడం జరిగిందని గ్రంథాలయ అధికారి కే సుమన్ కుమార్ తెలిపారు. అనంతరం వేమన పద్యాలు, సుమతి పద్యాలు, భగవద్గీత శ్లోకాలను ఎంపీయుపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ రమంబా.. విద్యార్థులచే చదివించి.. వాటి అర్థాలను వివరించారు.. సమ్మర్ క్యాంపును ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు పద్యాల పోటీనిర్వహించారు. పాఠ్యపుస్తకాలతో పాటు చిన్నతనం నుండి రామాయణం, భారతం భాగవతం, భగవద్గీత.. మొదలగు ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా విద్యార్థులు చదవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నెక్కంటి శ్రీనివాస్ గ్రంథ పాలకుడు కే సుమన్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
