గిరిజన విద్యార్థిని గంగోత్రికి అవార్డు

May 7,2025 21:45
నిలిచిన గంగోత్రిని కలెక్టర్‌ అభినందించారు.

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గిరిజన ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులలో 540 అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన గంగోత్రిని కలెక్టర్‌ అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎన్‌ఎన్‌ నాయక్‌, డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి చేతులు మీదుగా విద్యార్థిని ఎస్‌.గంగోత్రి అవార్డ్‌, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థిని గంగోత్రి కలెక్టర్‌ ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగోత్రిని కలెక్టర్‌ అభినందించారు. వసతి గృహంలో చదువుకుంటూ, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చక్కటి ఫలితాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారని కలెక్టర్‌ కొనియాడారు. ఈ సందర్భంగా గంగోత్రిని గిరిజన సంక్షేమ అధికారి కెఎన్‌.జ్యోతి, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ ఇందిరా అభినందించారు.

➡️