ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణంలో గురువారం యర్రగొండపాలెం తాలూకా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి విశ్వరూపాచారి మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం దష్టికి వెళ్లేలా సంఘటితంగా ఉద్యమిస్తామని తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, పింఛన్ రివిజన్లకు సంబంధించి పెండింగ్ కేసులు, హెల్త్ కార్డుల సరైన అమలు లేకపోవడం, డీఏ పెండింగ్ చెల్లింపులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలన్న డిమాండ్లు ప్రాధాన్యతగా ఉన్నాయని వివరించారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా ఎన్ రామిరెడ్డి వ్యవహరించారు. గౌరవ అధ్యక్షులుగా టీఎల్ సుబ్బయ్య, షేక్ అమీనా సాహెబ్, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, అధ్యక్షుడుగా డిసిహెచ్ బాదరయ్య, ప్రధాన కార్యదర్శిగా టీఎస్ఎల్వి సత్యనారాయణ, కోశాధికారిగా వై యోగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎల్ సుబ్బారావు, పిఎల్ నారాయణ, సిహెచ్ నరసింహులు, షేక్ బేగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె కోటయ్య, సహాయ కార్యదర్శులుగా జి ఐజయ్య నాయక్, టిసిఎస్ సుబ్బారావు, బి ఆవులయ్య, కె పిచ్చయ్య, సిహెచ్ పవన్ కుమార్, అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా ఎన్ వెంకటేశ్వర్లు, ఎన్వి భాస్కర్రెడ్డి, సలహాదారులుగా షేక్ నబీసాహెబ్, పి మల్లారెడ్డి, టి రాందాసు, షేక్ మహబూబ్వలి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికైన కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
