కాలినడక రహదారి పనులు ముమ్మరం

పోలవరం: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీభద్రకాళి సమేత విరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు గోదావరి నది దాటేందుకు పంటెలతో ఏర్పాటు చేసే కాలినడక రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 8వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నట్లు పెర్రీ కాంట్రాక్టర్‌ మైగాపుల సత్యనారాయణ తెలిపారు.

➡️