జెసి ధాత్రిరెడ్డి
ప్రజాశక్తి – భీమడోలు
మండల పరిధిలో ధాన్యం సేకరణ నిర్ణీత లక్ష్యం పూర్తయిన నేపథ్యంలో మరొక పది వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు అవసరమైన చర్యలను చేపట్టామని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తెలిపారు. గుండుగొలనులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపులు, అందుబాటులో ఉన్న గోనె సంచుల నిల్వలు ఇతర అంశాలను పరిశీలించారు. గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. రైతులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ఉషారాణి మండలానికి తొలుత కేటాయించిన 32,500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, రైతుల ఖాతాలకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సొమ్ములు జమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి డాక్టర్ హబీబ్ భాష, ఎడి పియుఆర్.కుమారి, తహశీల్దార్ రమాదేవి, కూటమి నాయకులు సిరిబత్తిన కొండబాబు పాల్గొన్నారు.
