కలిదిండి: మండలంలోని కోరుకొల్లు క్రాంతి హై స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వర్రె జగన్నాథం చారిటబుల్ ట్రస్ట్, క్రాంతి హై స్కూల్ కరస్పాండెంట్, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు చన్నంశెట్టి కృష్ణ, గుడివాడ లయన్స్ క్లబ్, విజయవాడ అను గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్, క్రాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంప్లో సుమారు 550 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వర్రె వెంకట సత్యన్నారాయణ, నీరజ (యుఎస్ఎ) దంపతుల ఆర్థిక సాయంతో ఉచితంగా కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథి 204 కృష్ణా జిల్లా ఫౌండర్ గవర్నర్ సనక సుబ్బారావు క్యాంప్ ప్రారంభించగా అను గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ మేనేజర్ ఎస్.శివశంకర్, కార్డియాలజీ వైద్యులు జిఐ.ఖాన్, న్యూరాలజీ వైద్యులు సిహెచ్.నాగ ప్రియ, రుమాటాలజీ వైద్యులు ఎ.లక్ష్మి, గైనకాలజీ వైద్యులు బి.సుజాత, ఆప్తమాలజీ వైద్యులు కె.పోతురాజు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ అజ్జ ప్రసాద్, కో ఆర్డినేటర్ గంట, కార్యదర్శి గొర్తి వెంకట కృష్ణకుమారి, ట్రెజరర్ చన్నంశెట్టి సుబ్బలక్ష్మి, ప్రిన్సిపల్ అజేష్ బాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
