ఏలూరు కాలవగట్టుపై కట్టడాల తొలగింపు

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఏలూరు కాలవ గట్టు వెంబడి ఉంగుటూరు మండలంలో ఆక్రమణను తొలగించాలని లోకాయుక్త ఉత్తర్వులు మేరకు అధికారులు సోమవారం ఉదయం విద్యుత్ సర్వీసులు తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. ఉంగుటూరు గ్రామంలో 135 ఆక్రమణలకు గానూ 35 మంది కోర్టుకెళ్లారు. మిగతా వాటిని పోలీస్ బందోబస్తు సాయంతో ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బంది సమన్వయంతో  తొలగింపు పనులు ఉదయం 6 గంటలకే మొదలయ్యాయి. నిడమర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సుభాష్ పరిరక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి బివి రవిచంద్ర, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీరామ్ పాల్గొన్నారు.

➡️