పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ప్రజాశక్తి – పోలవరం
పోలవరంలో గోదా వరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు శబరి, ఇంద్రావతి, సీలేరు, కిన్నెరసాని, మానేరు, ప్రాణహిత, మంజీర, పూర్ణ, ప్రవర నుంచి గోదావరిలో వరద జలాలు ప్రవహిస్తున్న నేపథ్యంలో నీటిమట్టం గత రెండు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతుంది. స్పిల్‌ వేలోకి వస్తున్న గోదావరి జలాలను ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో స్పిల్‌ వేలో సాధారణ నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఎగువన 26.970 మీటర్లు, స్పిల్‌ వే దిగువన 17.060 మీటర్లు, ఎగువ కాఫర్‌ డ్యాంకి ఎగువన 27.050 మీటర్లు, దిగువ కాపర్‌ డ్యాంకి దిగువన 16.080 మీటర్లు నమెదైనట్లు ఇఇలు టి.వెంకటరమణ, మల్లి కార్జునరావు తెలిపారు. పట్టిసీమ నుంచి 7.080 క్యూసెక్కుల జలాలు విడుదలపట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7.080 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పెద్దిరాజు శుక్రవారం తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 15.387 మీటర్లకు చేరుకుందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 పంపులు 20 మోటార్లతో నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ 4.015 టిఎంసిల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.

➡️