జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ -ఉప్పుటేరు వద్ద ఆధునిక అవుట్ పోస్టు ప్రారంభం
ప్రజాశక్తి – కైకలూరు రూరల్
జిల్లా సరిహద్దు ఉప్పుటేరు వంతెన వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్పోస్టును జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ బుధవారం ప్రారంభించారు. రాజు గోపాల్రాజు సౌజన్యంతో ఆధునిక అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను అమర్చారు. ఈ సందర్భంగా ఎస్పి అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడం, మత్తు పదార్థాలు, సారా ఇతర అక్రమ రవాణాను నివారించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కైకలూరు రూరల్ సిఐ వి.రవికుమార్, ఎస్ఐ రాంబాబు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో ఎస్పి తనిఖీలు నిర్వహించారు. సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందించారు.
