ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Apr 18,2025 21:38

 ప్రజాశక్తి-కొత్తవలస :  ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎపిఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎపిఎన్‌జిఒ అసోసియేషన్‌ కొత్తవలస తాలూకా యూనిట్‌ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం తాలూకా అధ్యక్షులు జె.వి.ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సీనియర్‌ ఎఎన్‌ఎంలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాల న్నారు. సచివాలయ హెల్త్‌ సెక్రటరీలను గ్రేడ్‌ -11 ఎఎన్‌ఎం లుగా ఉద్యోగోన్నతి జాబితా జిల్లాల వారీగా తయారు చేయాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ అసిస్టెంట్ల రీడెప్లాయిమెంట్‌ రద్దు చేసి, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పిఆర్‌సి కమిషన్‌ చైర్మన్‌ని నియమించాలని, ముందుగా ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. పంచాయతీ సెక్రటరీల జీతాలు వ్యత్యాసాలు సరి చేయాలని, ఐసిడిఎస్‌ ఉద్యోగులకు ఎఫ్‌టిఎలు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో తాలూకా సెక్రటరీ శ్రీను, ట్రెజరర్‌ కృష్ణారావు, భాగ్యలక్షి, స్వర్ణలత, ఈశ్వరరావు, కళావతి, సూర్యారావు, సత్యారావు, వెంకట రమణ, శంకరరావు పాల్గొన్నారు.

➡️