ప్రజాశక్తి-ఉయ్యూరు (కృష్ణా) : పనిచేస్తూ ఉపాధి హామీ కార్మికుడు అస్వస్థతకు గురై పడిపోయి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం ఉయ్యూరు మండలంలో జరిగింది. బోళ్ల పాడు గ్రామంలో ఉపాధి పనులు చేస్తూ కార్మికులు ఉన్నపాటుగా పడిపోయాడు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పటల్ లో చేర్పించగా అప్పటికే కార్మికుడు మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీడీవో జి ఎస్ వి శేషగిరిరావు బాధిత కుటుంబానికి అవసరమైన సంబంధిత పత్రాలను ఉన్నతాధికారులకు తెలిపి కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.
