ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో పనిముట్లు ఇవ్వాలి

May 6,2025 15:33 #west godavari

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలి, పని ప్రదేశాలలో సౌకర్యాలు కల్పించాలి అని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జగన్నాధపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ చాలా కాలం క్రితం ఇచ్చిన పనిముట్లు తప్ప ఈ మధ్యకాలంలో పనిముట్లు, టెంట్లు గానీ ఇవ్వలేదని, గతంలో ఇచ్చిన మాదిరిగా సమ్మర్ అలవెన్స్ ను పునరుద్ధరించాలని తెలిపారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఉపాధి హామీని సక్రమంగా అమలు కోసం కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పీల గాది నాయుడు, జీ. వెంకటేశ్వరరావు, కోనవరపు నాగభూషణం, కే. వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.

➡️