ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహిద్దాం : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

  • 10లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సత్కారం
  • ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆర్డీఓ భానుప్రకాష్‌

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ ఏడాది పదవ తరగతి లో మండల టాపర్‌ (మొదటి, ద్వితీయ, తఅతీయ) గా నిలిచి ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ప్రోత్సాహిద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. మంగళవారం పిచ్చాటూరు ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో పిచ్చాటూరు, నాగలాపురం, నారాయణవనం, కేవీబి పురం మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, శ్రీకాళ హస్తి డివిజన్‌ ఆర్డీఓ భానుప్రకాష్‌ పాల్గని ప్రసంగించారు. మొదటగా ఆర్డీఓ మాట్లాడుతూ … తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చక్కగా చదివి అత్యుత్తమ మార్కులతో మండల టాపర్‌ గా నిలిచిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ … విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని, ప్రభుత్వ పాఠశాలను అభివఅద్ధి చేయాలన్న తపనతో ఉన్నారన్నారు. విద్యార్థి విద్యార్థినులు అందరు భవిష్యత్తులో డాక్టర్‌ లు, కలెక్టర్‌ లు, ఇంజనీర్‌ లు, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బి. ఈడి, ఎం.ఈడి వంటి ఉన్నత చదువులు చదివిన ఉపాద్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ టీచర్‌ లు అందురు కష్టపడి, భాధ్యతయుతంగా పనిచేసి, పేద విద్యార్థులకు చక్కగా చదువు నేర్పి వారి ఉన్నతికి సహకరించాలని కోరారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మేధస్సును వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే అభిలషించారు. అనంతరం నాలుగు మండలాల్లో అత్యుత్తమ మార్కులు(మొదటి, ద్వితీయ, తఅతీయ) సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆర్డీఓ భాను ప్రకాష్‌ తో కలిసి మెడల్‌ లు, ప్రశంసా పత్రాలు అందించి, శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, తల్లిదండ్రులకు, పుత్తూరు డీ.వై. ఈ. ఓ ప్రభాకర్‌ రాజు, తహశీల్దారు టీవీ సుబ్రమణ్యం, ఎంపీడీఓ మహమ్మద్‌ రఫీ, ఎంఈఓ హేమామాలిని, బాబయ్య, యుగంధర్‌ రాజు, ఏఎంసీ చైర్మన్‌ డి. ఇలంగోవన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️