ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : పెద్దాపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ … అనేక సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినప్పటికీ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. తమ సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి ఇనుమర్తి శ్రీనివాస అయ్యప్ప స్వామి, సుంకర సత్తిరాజు, నామా సూర్య ప్రకాశరావు, పూల ప్రశాంత్, మహపాతిన పాపారావు, వాకాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
