ప్రజాశక్తి – అమలాపురం రూరల్ : సరస్వతి ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టి ఎస్ ఎన్ మూర్తి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ను శుక్రవారం అమలాపురం మండలం పేరూరు వై జంక్షన్ లో పేరూరు సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్,బోడసకుర్రు సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు లు సంయుక్తం గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పేరూరు ఉప సర్పంచ్ కుడుపూడి సత్యనారాయణ, పులుసు జగదీశ్, మానసిక వైద్యులు డా. గంగరాజు, పండు అశోక్ కుమార్,దొంగ కుమార్, అడపా శ్రీను, నాతి శ్రీనివాసరావు, జల్లి శ్రీనివాసరావు, నెల్లి ప్రసాద్, దేవరపల్లి వీరేష్ కుమార్,యెలమిల్లి కొండ, ట్రస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
