పండగ ఏర్పాట్లు పరిశీలన

May 7,2025 21:21

ప్రజాశక్తి-సాలూరు :  పట్టణంలో ఈ నెల 18,19,20 తేదిలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగ ఏర్పాట్లను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి బుధవారం పరిశీలించారు. తొలుత శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయం ప్రాంగణాన్ని పరిశీలించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఆలయ వెనక భాగాన మైదానంలో మంచినీరు, మజ్జిగను సరఫరా చేయాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. ఆలయం చుట్టూ చేపడుతున్న ఫ్లోరింగ్‌ వర్క్‌ను, పరిసరాలను పరిశీలించారు. తరువాత అల్లువీధి వద్దనున్న అమ్మవారి సినిమానును పరిశీలించారు. సిరిమాను తిరిగే రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. పండుగ సందర్భంగా వాహన పార్కింగ్‌ స్థలాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డిటివి.కష్ణారావు, తహశీల్దార్‌ ఎన్‌వి రమణ, ఎంపిడిఒ పార్వతి, డిఇ ప్రసాద్‌ రావు, శివకుమార్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ బాలకష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

➡️