పురుగులమందు డబ్బాలతో రైతు కుటుంబం ధర్నా

మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం పురుగులమందు డబ్బాలతో బోడపాడు రైతు కుటుంబం ధర్నా చేపట్టింది. తమ భూమిని గత వైసిపి ప్రభుత్వం లో వైసీపీ సర్పంచ్‌ బంధువులు అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారని బాధితులు వాపోయారు. భూమి విషయాన్ని అడిగితే తమపై దాడి చేశారని కన్నీటి సంద్రమయ్యారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుండి పోయేది లేదని పురుగుల ముందు డబ్బాలతో బాధితులు అక్కడే బైఠాయించారు. రైతు కుటుంబం నిరసనకు తహశీల్దార్‌ చిరంజీవి స్పందించారు. కారకులకు నోటీసులిచ్చి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

➡️