జొన్నల కొనగోలు కేంద్రాల వద్ద రైతుల ధర్నా

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : వె హౌస్‌ గోదాములకు తెచ్చిన జన్నలను తక్షణమే తీసుకోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం నాయకులు, రైతులు అధికారులను కోరారు. గత నాలుగు రోజులుగా నంద్యాల వె హౌస్‌ వద్ద జొన్నల లోడ్‌ తో పడిగాపులు గాస్తున్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం నాయకులు స్పందించారు. శనివారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్‌, జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడులు రైతుల వద్దకు వెల్లి మాట్లాడారు. అక్కడికి వెళ్లిన రైతు సంఘం నాయకులకు జన్న రైతులు తమ బాధను వెళ్లబుచ్చారు. నాలుగు, ఐదు రోజుల నుండి జన్నలు లోడుతో పడిగాపులు కాస్తున్నామని,సివిల్‌ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన ధర్నా చేపట్టారు.ఈ ధర్నా కార్యక్రమంలో గడివేముల, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, వెలుగోడుమండలాల నుంచి వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. తెచ్చిన జన్నల లోడ్‌ ను తక్షణమే ఆన్‌ లోడ్‌ చేసుకోవాలని, తెచ్చిన జన్నలను కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు. సివిల్‌ సప్లై అధికారులు ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రాజశేఖర్‌, టి. రామచంద్రుడు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నంద్యాల సెంట్రల్‌ వేర్‌ హౌస్‌ నందు గత నాలుగు రోజుల క్రితం నుండి 200 పైగా ట్రాక్టర్ల లో జన్నలు ఎత్తుకొచ్చిన రైతులు అవస్థలుపడుతున్నారని సప్లై అధికారులు జన్నలుకొనుగోలు చేసే విషయంలో ఆలస్యం జరుగుతుండడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.నాలుగు రోజుల నుంచి తిండి, నీళ్లు దొరకక నరక యాతన అనుభవిస్తున్నారన్నారు.అధికారుల నిర్లక్ష్యం వలన రోజువారి ట్రాక్టర్‌ బాడిగలు, న చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్‌ సప్లై అధికారులను కోరారు.సివిల్‌ సప్లై జిల్లా అధికారి వెంటనే రైతుల వద్దకు రావాలని, జన్నలు వెంటనే కొనుగోలు చేయాలని, నాణ్యత పేరుతో జన్నలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు.

అధికారిలతో మాట్లాడిన రైతు సంఘం నాయకులు
రైతు సంఘం నాయకులు అధికారులతో మాట్లాడారు.రైతులకు ఇబ్బంందులు తలెత్తకుండ చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన కోరారు. ఒక ప్రణాళిక ప్రకారం సివిల్‌ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలకు రైతాంగాన్ని రమ్మని చెప్పకపోవడం వల్ల జిల్లావ్యాప్తంగా రైతులందరూ అధిక సంఖ్యలో వాహనాలతో జన్నలు ఎత్తుకొని రావడం మూలంగా, అన్లోడ్‌ చేయడానికి అవసరమైన హమాలీలను అందుబాటులో పెట్టుకోకపోవడం, తూకం వేసే సిబ్బందిని తగినంత లేకపోవడం వలన, స్టాక్‌ పెట్టడానికి అవసరమైన గోడౌన్లు పెట్టకపోవడం మూలంగా రైతాంగం ఎండల్లో నాలుగు రోజుల నుండి పడికాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని అధికారుల దఅష్టికి తీసుకెళ్లారు.వెంటనే లోపాలను సరిదిద్ది, రైతులందరిని వెంటనే కొనుగోలు చేయాలని డిఎం ను కోరారు. రైతు సమస్య పై స్పందించిన సివిల్‌ సప్లై అధికారి రాజ్‌ నాయక్‌ రైతుల వద్దకు వచ్చి కొనుగోలుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం లో జరిగిన లోపాల వల్లనే నాలుగు రోజుల నుండి వెహికల్స్‌ ఆగిపోయాయని,నేటి నుండి అలస్యం జరగకుండా చూసుకుంటానని అందుకు అవసరమైన యంత్రాంగాన్ని వెంటనే సమకూర్చుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం వరకు వచ్చిన జన్నల లోడ్‌ మొత్తం సాయంత్రం లోగా అన్లోడ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం నుండి రోజు ఒకటి రెండు మండలాలు కొన్ని గ్రామాలు పరిమితం చేస్తూ ముందస్తుగా వ్యవసాయ అధికారుల ద్వారా అన్ని గ్రామాల్లోకి సమాచారం ఇస్తామన్నారు. ఇక్కడికి వచ్చిన వెహికల్స్‌ ఆగిపోకుండా వెంటనే అన్లోడ్‌ అయ్యే విధంగా జిల్లాలో పండించిన ప్రతి రైతు జన్నల్ని కొనుగోలు చేస్తామని డి ఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ప్రతి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జిల్లా కేంద్రంలో ఒత్తిడి తగ్గుతుందని, నాణ్యత పరిశీలన కూడా గ్రామాల్లోని రైతు సేవ కేంద్రాల ద్వారా అక్కడే నిర్వహించి ఏరోజు ఏ గ్రామం వాళ్ళు కొనుగోలు కేంద్రాలకు రావాలో అక్కడే ముందుగానే పర్మిట్‌ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. రైతాంగం చెప్పిన ప్రతి సమస్యలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా పరిష్కరిస్తారని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన రైతులు, వివిధ గ్రామాల రైతు పెద్దలు హుస్సేన్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి అబ్దుల్‌ భాష బాల వెంకట్రెడ్డి చిత్రం రెడ్డిలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా నాయకులు ఏ. సురేస్‌,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️