రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె వ్యవసాయ రంగంలో రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు రూపొందించాలని కడప జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ వ్యవసాయ శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆవరణలో తిరుపతి ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా స్థానం ఆధ్వర్యంలో రెండు రోజుల దక్షిణ మండలి వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల తలసరి ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు, వారి జీవన ఆర్థిక స్థితిని మెరుగు పరచడం కోసం ప్రతి వ్యవసాయ శాస్త్రవేత్త, అధికారి, రైతు సశ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. గత 20 ఏళ్లుగా శాస్త్రీయబద్ధంగా సిద్ధాంత పరంగా సూచించిన సూచనలే రైతులు అనుసరించేవారన్నారు. ప్రస్తుతం రైతులే క్షేత్రస్థాయిలో శాస్తవేత్తలుగా ఎదుగుతున్నారంటే గర్వించదగ్గ విషయమన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలుగా రైతులకు కావాల్సిన నిజమైన శాస్త్రీయ పద్ధతులను అందజేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురయ్యే నిజమైన సమస్యను గుర్తించినపుడే రైతులకు సంపూర్తి స్థాయిలో సహకారం అందించిన వారు అవుతారన్నారు. పరిశోధన ప్రాణాళికలో పారదర్శకత, నిజాయితీ లేకపోతే కొన్ని రకాల సంప్రదాయ, వారసత్వ పంటలుగా పేరొందిన పంట రకాలను మన ప్రాంత రైతులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వాతావరణ మార్పులకు, మన ప్రాంత భూమి స్వరూపానికి అనుగుణంగా పంటల పరిశోధన జరగాలన్నారు.. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌ కల్చర్‌ వ్యవసాయ రంగాన్నే పూర్తి స్థాయిలో మార్చి వేసిందన్నారు. సాగునీటి వ్యవస్థలో కూడా విస్తతమైన, ఉపయోగకరమైన, అనుకులపైన పద్ధతులను అనుసరించేలా కొత్త పద్ధతులను వెతకాలన్నారు. పరిశోధన అనేది కేవలం తాత్కాలిక లాభాల కోసం జరగకూడదని సాగుబడికి, దిగిబడికి, మార్కెటింగ్‌కు అనువైన లాభదాయకమైన, మెకనైజేషన్‌ తోకూడిన నాణ్యమైన పద్ధతులను సూపొందించాలన్నారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను.. రైతులకు ప్రజలకు సీజన్ల వారీగా విస్త తంగా ప్రచారం చేయాలన్నారు. శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు చేరవేయడంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల కమ్యూనికేషన్‌ సాధనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయం గుంటూరు లామ్‌ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న సంవత్స రంలో వ్యవసాయ పంటల సాగు ప్రాణాళికను సమర్థవంతంగా రూపొందించి.. రైతులకు లాభదాయకమైన పంటలను ఎంపిక చేయాలని శాస్త్రవేత్తలు, రైతు శాస్త్ర వేత్తలను కోరాను. విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.శివనారాయణ మాట్లాడుతూ సాగుకు ఆమోదయోగ్యమైన భూములు దక్షిణ మండల వ్యవ సాయ ప్రాంత పరిధిలో 30 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ శాతాన్ని మూడింతలు పెంపొందించేందుకు రైతులను ప్రోత్సహిస్తూ లాభదాయకమైన పంటల వంగడాలను సాగులోకి తీసుకు వచ్చేనెదుకు వ్యవసాయ అనుబంధ శాఖల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు కషి చేయాలన్నారు. రాస్‌ పరిశోధన సహాయ సంచాలకులు డాక్టర్‌ వి.సుమతి మాట్లాడుతూ దక్షిణ మండలం, జిల్లాల విభజన తరువాత తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు మొదలైన ఐదు జిల్లాలుగా ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. దక్షిణ మండలంలో ఖరీఫ్‌ కాలంలో 3,14,715 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంకు గాను 2,28,688 హెక్టార్లలో (73 శాతం) వివిధ వ్యవసాయ పంటలు సాగుబడి చేయగా రబీలో 4,99,984 హెక్టార్లకు గాను 3,82,470 హెక్టార్లలో (76 శాతం) వివిధ పంటలు సాగు చేయడమైనదన్నారు. అనంతరం దక్షిణ మండల వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిధిలో శాస్త్రవేత్తలు ప్రచురించిన పలు రకాల ప్రచురణ పుస్తకాలను కలెక్టర్‌ సంబంధిత శాస్త్రవేత్తలు, సంచాలకులతో కలిసి ఆవిష్కరించారు.కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్‌ శారదమ్మ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు, దక్షిణ మండల జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️