ప్రజాశక్తి-శింగరాయకొండ : మాజీ మంత్రి, వైసిపి కొండపి నియోజక ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను శింగరాయకొండ వైస్ ఎంపిపి సామంతుల రవికుమార్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. గతంలో రవికుమార్ రెడ్డి వైసిపి మండల అధ్యక్షుడి ఉన్న సమయంలో ఆయన స్వగ్రామైన బింగినపల్లిలో గొడవలు జరిగాయి. ఆ సమయంలో పోలీసు స్టేషన్ను రావాలని ఆదిమూలపు సురేష్ను కోరారు. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో సామంతుల రవికుమార్ రెడ్డిని పార్టీ నుంచి వైసిపి సస్పెండ్ చేసింది. రవికుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తి వేస్తున్నట్లు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్వర్వులు అందాయి. అందులో భాగంగా మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను ఆయన క్యాంపు కార్యాలయంలో రవికుమార్ రెడ్డి కలిసి శాలువా కప్పి సన్మానించారు. వైసిపి అభివద్ధి కోసం తాను కషి చేస్తానని ఈ సందర్భంగా రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, షేక్.కరీం, పి.శ్రీనివాసరెడ్డి, చుక్కా కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
