ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు

May 6,2025 18:31 #alamuru, #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : ఉచిత వైద్య శిబిరాల ద్వారా అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏ.రాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం స్థానిక ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన శ్రీ భాను తేజస్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్, రేవతి హాస్పిటల్, డాక్టర్ మోహన్ డయాబెటిక్ హాస్పిటల్, గౌతమి నేత్రాలయం, రమా దంత వైద్యశాల వంటి పలు హాస్పటల్లకు చెందిన వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బిపి, ఉదరము, ఎముకలు, కంటికి సంబంధించిన వైద్య సేవలు అందించి ఉచిత మందులు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లోని సుమారు 152 మంది ఉద్యోగులు పాల్గొని ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీపక్, డాక్టర్ పవన్, డాక్టర్ మోహన్, డాక్టర్ విజయ, తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️