మానవ హక్కుల సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా గార

May 6,2025 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సామాజికంగా, వ్యక్తిగతంగా పీడితుల తరపున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార. సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితు లయ్యారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి, బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన భారత మానవ హక్కుల సంరక్షణ బాధ్యులు గార సత్యనారాయణకు సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత మానవ హక్కుల సంరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ప్రసాద్‌ రావు మాట్లాడుతూ మానవ హక్కుల సంరక్షణలో తమ సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మానవ హక్కులను ఎవరు కాలరాసినా బాధితుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ సంస్థలు, సమాజంలో ఏ రకమైన బాధితులు ఉన్నా, వారు తమ దృష్టికి తెస్తే అండగా నిలుస్తామని తెలిపారు.

➡️