భారత మానవ హక్కుల సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గార.సత్యన్నారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సామాజికంగా, వ్యక్తిగతంగా పీడితుల తరపున అవిశ్రాంతంగా పోరాటం చేసి వారి హక్కులను కాపాడటమే ధ్యేయంగా కఅషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గార.సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేసి, బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన భారత మానవ హక్కుల సంరక్షణ బాధ్యులు గార.సత్యనారాయణకు సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత మానవ హక్కుల సంరక్షణ జాతీయ అధ్యక్షుడు ఆర్‌. ప్రసాద్‌ రావు మాట్లాడుతూ మానవ హక్కుల సంరక్షణలో ఎనలేని కృషిని సాధించిన తమ సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మానవ హక్కులను ఏ ఒక్కరు కలరాసిన బాధితుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు గార సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ సంస్థలు, సమాజంలో ఏ రకమైన బాధితులు ఉన్నా, వారు తమ దృష్టికి సమస్యను తెచ్చినట్లయితే వెంటనే తగు న్యాయపరమైన పోరాటం చేసి వారికి అండగా నిలుస్తామని మాట ఇచ్చారు. ఎంతో గురుతురమైన బాధ్యతను తనపై విశ్వాసంతో ఉంచిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థను అభివృద్ధి బాటలో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️