టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే హవా

Apr 23,2025 22:35

 87.04 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 7వ స్థానం

79 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

590 మార్కులు పైన 9 మంది విద్యార్థులు

60 పాఠశాలల్లో గత ఏడాదికంటే తగ్గిన ఫలితాలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది 87.04 శాతం ఫలితాలతో మన జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 91 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 7 వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 87.04శాతం సాధించింది. జిల్లాలోని 79 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, గత ఏడాది కంటే 60 పాఠశాలల్లో ఫలితాలు తగ్గాయి. మరోవైపు పక్కనే గల పార్వతీపురం మన్యం జిల్లా ….శాతం ఉత్తీర్ణతతో వరుసగా మూడోసారి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.ఈఏడాది జిల్లా వ్యాప్తంగా మొత్తం 22,777 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 19,824 మంది ఉత్తీర్ణులై 87.04 శాతం ఫలితాలు సాధించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సరాసరి 2శాతం ఫలితాలు తగ్గాయి.

జిల్లా వ్యాప్తంగా బాలురు 11,413 మంది హాజరు కాగా వారిలో 9748 మంది ఉత్తీర్ణులై 85.41 శాతం ఫలితాలు సాధించారు. బాలికలు 11,364 మంది హాజరు కాగా వారిలో 10,076 మంది ఉత్తీర్ణులై 88.67 శాతం ఫలితాలు సాధించారు. జిల్లాలో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. 102 మంది విద్యార్థులకు 590కు పైగా మార్కులు జిల్లా వ్యాప్తంగా 102 మంది విద్యార్థులు 590 మార్కులు దాటి సాధించారు. అత్యధికంగా బొబ్బిలిలోని అభ్యుదయ స్కూలు విద్యార్థి పక్కి సాయి విజరు 596 మార్కులు సాధించాడు. విజయనగరానికి చెందిన డొంక హర్షిణి, మల్లారెడ్డి నిహాల్‌, సింగంపల్లి శ్రీ వెంకట ఆనంద్‌ లాస్య ప్రియ, కేదారి లోకేష్‌, కొల్లి సౌశీల్య 595 మార్కులు చొప్పున సాధించారు. 9మంది విద్యార్థులు 594 చొప్పున సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సత్తా చాటిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటారు.

590 మార్కులు దాటి 9 మంది విద్యార్థులు సాధించారు.

కొయ్య హరీష్‌ (భోగాపురం మోడల్‌స్కూలు) 593, సంగరెడ్డి వివేక్‌ (జెడ్‌పి హైస్కూలు, గర్భాం) 593, లావేటి మెహర్‌ రేష్మ (నెల్లిమర్ల గురుకుల పాఠశాల) 592, చోడవరపు శివ (కారాడ గురుకుల పాఠశాల) 592, పెదిరెడ్ల భాగ్యశ్రీ (కొట్యాడ జెడ్‌పి హైస్కూలు) 592, శంబంగి లావణ్య (పక్కి జెడ్‌పి హైస్కూలు) 592, తాడేల రేవంత్‌ (భైరిపురం జెడ్‌పి హైస్కూలు) 591, సెనేటీ మోహన్‌ (కారాడ బిసి గురుకుల పాఠశాల) 591, పైల యశోధ (జిన్నాం జెడ్‌పి హైస్కూలు (581) మార్కులు సాధించారు. వివిధ యాజమాన్య పాఠశాలల ఫలితాలు జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9మంది విద్యార్థులు 590 మార్కులు దాటి సాధించారు. 13 ఎపి మోడల్‌ స్కూల్స్‌ నుంచి 1158మంది పరీక్షకు హాజరు కాగా 1075 మంది ఉత్తీర్ణులై 92.83 శాతం ఫలితాలు సాధించారు. 3 ఎపి రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నుంచి 161 మంది హాజరు కాగా 169మంది ఉత్తీర్ణులై 99.38 శాతం నమోదు చేశారు. 8సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల నుంచి 559 మంది హాజరు కాగా 485 మంది ఉత్తీర్ణులై 86.76 శాతం, 6 బిసి గురుకులాలు నుంచి 410 మంది హాజరు కాగా 396 మంది ఉత్తీర్ణులై 96.59 శాతం, 26 కెజిబివి పాఠశాలల నుంచి 971 మంది పరీక్షకు హాజరు కాగా 890 మంది ఉత్తీర్ణులై 91.66 శాతం, 214 జెడ్పీ హైస్కూల్స్‌ నుంచి 11488 మంది పరీక్షకు హాజరు కాగా 9526 మంది ఉత్తీర్ణులై 82.92 శాతం ఫలితాలు సాధించారు.5 మున్సిపల్‌ హైస్కూల్స్‌ నుంచి 682 మంది హాజరు కాగా 439 మంది ఉత్తీర్ణులై 64.37శాతం, 132 ప్రైవేటు పాఠశాలలు నుంచి 6314 మంది హాజరు కాగా 6088 మంది ఉత్తీర్ణులై 96.42 శాతం ఫలితాలు సాధించారు.

ఒక ఎయిడెడ్‌ పాఠశాల నుంచి 147మంది హాజరు కాగా వారిలో 128 మంది ఉత్తీర్ణులై 87.08 శాతం ఫలితాలు సాధించారు.

‘గత పదేళ్లలో జిల్లాలో వచ్చిన ఫలితాలు

సంవత్సరం               శాతం

2014-15     92.99

2015-16     92.47

2016-17      93.36

2017-18     96.01

2018-19     97.28

కరోనా సంవత్సరం..

2019-20      100

2020-21      100

జిల్లా విభజన తర్వాత

2021-22       77.50

2012-23      76.60

2023-24      91.82

2024-25    87.04

➡️