ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల కేంద్రంలో తమకు ఉపాధి హామీ పనులు కల్పించాలని పలువురు ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తూ నార్పల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీల ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిర్వహించడం లేదని తమకు కుటుంబ కోసమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓఆర్డి శైలజా రాణి ఏ పీ ఓ రమేష్ రామారావు కూలీలతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి సాధ్యమైనంత త్వరలోనే కూలీలందరికీ ఉపాధి పనులు కల్పిస్తామని తెలిపారు.
