సత్కారం పొందుతున్న పెనుగొండ లకీëనారాయణ, గీత దంపతులు
ప్రజాశక్తి – వినుకొండ : కళలు, సాహిత్యం, ప్రజా పోరాటాలకు పుట్టినిల్లయిన వినుకొండ తన సొంత ప్రాంతమని, నాడు చెప్పుల్లేకుండా తిరిగిన వీధుల్లోనే నేడు కారులో ఊరేగించడం ఆనందంగా ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. విద్యావంతుల వేదిక ఆధ్వరంలో జాషువా కళా ప్రాంగణంలో సోమవారం రాత్రి సన్మానించారు. తొలుత ఆయన్ను సురేష్ మహల్ సెంటర్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శివయ్య, గంగినేని, జాషువా విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. అనంతరం సీనియర్ న్యాయవాది పీజే లూకా అధ్యక్షతన నిర్వహించిన సభలో లకీëనారాయణ మాట్లాడుతూ అభ్యుదయ కవి పులుపుల శివయ్య చిన్న, వయస్సులో వేలు పట్టి బిడ్డగా నడిపించారని గుర్తు చేసుకున్నారు. జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ లకీëనారాయణను రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించేలా కృషి చేస్తానన్నారు. వినుకొండలో జాషువా కల్యాణ మండపంతో పాటు మరో రెండు ఓపెన్ ఎయిర్ థియేటర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ జాతీయ ఔన్నత్యాన్ని చాటే సాహితీవేత్తలు, కవులను ప్రభుత్వాలు గౌరవించాలని, అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అది కరవైందని అన్నారు. సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి జాషువా తరువాత పెనుగొండ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. అనంతరం పెనుగొండ లక్ష్మీనారాయణ, గీత దంపతులను సన్మానించారు. కె.రామాంజనేయులు, మనీషా, డాక్టర్ పారా లక్ష్మయ్య, సీహెచ్ఎల్ఎన్ మూర్తి, షకీల, మారుతీ వరప్రసాద్, బి.వెంకటేశ్వర్లు, ఎండ్లూరి శేషగిరిరావు పాల్గొన్నారు. పహల్గామ్ మృతులకు సభ నివాళుర్పించింది.
