ప్రజాశక్తి – కాకినాడ : ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ కి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్ధం చల్లని త్రాగునీరు అందించేందుకు ఒక లక్ష పది వేల రూపాయల విలువైన కూలర్ ను అడిగిన వెంటనే అందించిన రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ ఆర్టీసీ మేనేజర్ మనోహర్ పేర్కోన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కి చెందిన గుముడిలి కుటుంబ సభ్యుల ఆర్ధిక సాయంతో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సెక్రటరీ నేమాని కళ్యాణి, ప్రసాద్ దంపతులు రిబ్బన్ కత్తిరించి వాటర్ కూలర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాలలో సుమారు 2.5 కోట్ల రూపాయలతో సామాజిక సేవాకార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ జగన్నాధరావు, శీమకుర్తి పాపారావు, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, స్టేషన్ మేనేజర్ వి ధర్మరావు, ఎస్ స్వామి, విఆర్ఓ సిహెచ్ వెంక ట్రాజు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
