ప్రజాశక్తి – ఆదోని : ఆదోని పట్టణంలోని శుక్రవారం పేటలో వెలసిన మారెమ్మ అవ్వ దేవర మహోత్సవాలు నేటి నుండి మొదలవుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గప్ప నాగరాజు తిమ్మప్ప తెలిపారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సిఐలు శ్రీరామ్, రాజశేఖరరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పూలమాల శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి జలాభిషేకం కుంకుమార్చన ఆకు పూజ ఉంటుందన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి బలి అర్పణ బోనాలు నైవేద్యం సమర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ హేమలత సారథంలో సీఐలు శ్రీరామ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మునెప్ప నిలకంఠప్ప, బాలు, అప్సర్ భాష, లక్ష్మీనారాయణ, తదితరులున్నారు.
